mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

31, జనవరి 2012, మంగళవారం

రాష్ట్రం లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ..లేక పోతే పెట్రోల్

మంత్రి గారు   చూడండి బావగారు ! మీ అబ్బాయి ఏమి కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను .ఏ జిల్లాలో ఏ ఫాక్టరీ  పెట్టుకుంటారో మీ ఇష్టం ..భూమి కూడా రప్పిస్తా
  వియ్యంకుడు   యేమి వద్దు కాని ...మీరు పైసా ఇవ్వనక్కర లేదు ..ఓ జీ ఓ పాస్ చేయించండి చాలు 
మంత్రి గారు ఏమిటి చెప్పండి ...గంటల లో వస్తుంది 
  వియ్యంకుడు  రాష్ట్రం లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి ..లేక పోతే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయారు అని 

(రాంచి జిల్లాలో హెల్మెట్ లేక పోతే పెట్రోల్ పోయకుండా పోలీసులు హుకుం జారి చేసారట )

30, జనవరి 2012, సోమవారం

.స్కూల్స్ ఎందుకు బంద్ చేయాలి ?.అసలు చేస్తున్న ఆందోళనలకు ..విద్య సంస్థాలకు సంబంధం ఉందా


ఈ సంవత్సరం పండుగ వరకు  రాష్ట్రం ఎంతో సంతోషం గా ఉంది ...తర్వాతే అన్ని చికాకులు..మళ్లీ బందులు ప్రారంబం కావడం విచారకరం ....జరుగుతున్నా సంఘటనలకు నిరసనగా కొన్ని బందు లైతే ...తమ సమస్యలు తీర్చమని ..ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి కొన్ని వర్గాలు బలవంతపు బందులు చేయిస్తున్న్నై ...ముఖ్యంగా ఆయ ప్రాంతాలలో స్కూల్స్ ను కూడా మూయడం దారుణం .....అసలు చేస్తున్న ఆందోళనలకు ..విద్య సంస్థాలకు సంబంధం ఉందా ?ఏ సమస్య వచ్చిన ముందు స్కూల్స్ మూయించి వేయడం అలవాటుగా మారింది .సర్కార్ ఈ విషయంలో తగిన చట్టం చేస్తే కాని స్కూల్స్ బాగు పడవు 

27, జనవరి 2012, శుక్రవారం

ramcharan "rachcha" title song leak "రచ్చ ".... పాట లీక్ సైలెంట్ చూపులోడు .. వైలెంట్ చేతలోడు కరంట్ కల్లలోడు .

రామ్ చరణ్ కొత్త చిత్రం "రచ్చ "....సంగీత మణిశర్మ .ఆడియో రిలీజ్ కాలేదు .అయితే ఓ పాట లీక్ అయ్యింది . టైటిల్ సాంగ్ అది .ఫాస్ట్ బీట్ లో ఉండే ఈ పాట కావాలని లీక్ చేసారా ? దొంగ చాటుగా విడుదల అయిందా? అనుమానమే ..ఇదివరకు కొన్ని తెలుగు సాంగ్స్ ఆలాగే లీక్ అవుతున్నాయి .ఇదే ఒక పబ్లిసిటీ కావచ్చు .చెప్పలేం ..ఏది ఏమైనా చరణ్ అభిమానులకు మంచి ఊపున్న పాట గా ఉంది .



సైలెంట్ చూపులోడు ..
వైలెంట్ చేతలోడు 
కరంట్ కల్లలోడు ....
..వీడు  చిరుత .......
అడుగేస్తే ఆంద్ర నైజాం రచ్చ ....

విగ్రహాలు ఏమి చేసాయి ?

విగ్రహాలు ఏమి చేసాయి ?
దేశం కోసం తన నిస్వార్ద సేవలు అందించిన మహానుభావులను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మనం వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్మరించుకోవడం మన మంచి సాంప్రదాయం .అలాంటి మహనీయులలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకరు ...దేశం లో ప్రతి గ్రామం లోనూ అయన విగ్రహం ఉంటుంది ....అమల పురం లో కొందరు దుండగులు విగ్రహాని పాడు చెయ్యడం దారుణం ..దీనితో కోనసీమలో ఉద్రిక్తత ...మళ్లీ దవలేస్వరం లో .......తూర్పు గోదావరికే తలవంపు తెచ్చే సంఘటనలు ఇవి .....అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు ...ఎవరి మీదో కోపం విగ్రహాలపై చూపించడం దుసంప్రదాయం అవుతుంది .....ఇది ఏదో ఒక జాతికి ..కులానికి సంబదించినది కాదు .....మహనీయుల జ్ఞాపకాలను వీలుంటే కాపాడే ప్రయత్నం చెయ్యాలి తప్ప కూల దోయ్యరాదు.  విగ్రహాలను పాడు చేసే వారికి  క ఠినంగా శిక్ష వేయాలి 

26, జనవరి 2012, గురువారం

గణతంత్ర శుభాకాంక్షలు

తెలుగు 
బ్లాగర్స్ 
 అందరికి 
గణతంత్ర 
శుభాకాంక్షలు 

25, జనవరి 2012, బుధవారం

కుల గజ్జి చాటుకోవడం దారుణం

బురద రాజకీయాలు  మరింత రొచ్చులో దిగుతున్నాయి .ఇదివరకు చాటుమాటుగా కుల రాజకీయాలు నడిపే నేతలు నేడు మీడియా ముందు కు వచ్చి మరి తమ కుల గజ్జి చాటుకోవడం దారుణం .మా కులం వారికి అన్యాయం జరిగిందని కొందరు ....మా కులపోడికి ఇవ్వకపోతే ఖబడ్దార్ అని మరి కొందరు చిందులు వేయడం జరుగుతోంది ...ఇదే పరిస్తితి కొన సాగితే రాష్ట్రం రావనకాష్టమే.

.అభిమానులు ! మీరు కొట్టుకోవడం ఎందుకు ?







బాలయ్య ,చిరు ల మధ్య మాటల యుద్ధం ఫాన్స్ ను ఇబ్బంది పెడుతోంది .సినిమా పరంగా అభిమానులైన వారు నేడు రాజకీయంగా కూడా సపోర్ట్ చేస్తూ అలజడి  రేపుకుంటున్నారు.ఏ హీరో అభిమానులైన ఒకటి గుర్తు పెట్టుకోవాలి .సినిమా వేరు .రాజకీయం వేరు ...నిజంగా సినిమా లో మెగాస్టార్ క్రజ్ ను బట్టి చిరుకు బంపర్ మెజార్టీ రావాలి .కాని ఏమైంది ? చిరు మళ్లీ సినిమా తీస్తే చూడడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు ......అలాగే మిగతా హీరోల వ్యవహారం కూడా ......బావ ను సి ఏం ను చెయ్యడానికి బాలయ్య తన ఇమేజ్ వాడుకుంటున్నారు ...కాంగ్రెస్ లో చిరు తన అదృష్టాన్ని పరిశేలించు కుంటున్నారు ..కాబట్టి అభిమానులు రాజకీయం గా ఎవరి ఎత్తులు వాళ్ళవి అని తెల్సుకోండి 

23, జనవరి 2012, సోమవారం

."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు ""-అన్న పొలిటికల్ బాలయ్య

అనుకున్నట్టుగానే బాలయ్య చిరు ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ,,,బాలయ్య  యమ దూకుడు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు .."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు "" అంటూ వైజాగ్ లో సింహ లో మాదిరిగా పొలిటికల్ డైలాగ్స్ వదిలి పెట్టారు .....పరొక్షమ్ గా చిరు పైన "నన్ను బాలుడు " అన్నారు అంటూ విమర్శ చేసారు .దీనిపై తిరుపతి లో చిరు బాలయ్య మాటలకు స్పదిన్చావాల్సిన అవసరం లేదని సింగిల్ డైలాగ్ తో తెల్సేసారట ..అయితే కొందరు చిరు అభిమానులు మాత్రం బాలయ్య దిష్టి బొమ్మను తగలుబెట్టినట్లు వార్తలు వస్తున్నై ..అంటే మొత్తానికి బాలయ్య రాజకీయంగా అగ్గి భాగానే రాజేస్తున్నారు .....మరి తెలుగు తమ్ములు బాలయ్యను ఏ రకంగా అర్ధం చేసుకుంటారో వేచి చూడవలసిందే .

22, జనవరి 2012, ఆదివారం

చిరంజీవి ,బాలకృష్ణ ... సై సై -పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

నాడు సినిమా పరంగా పోటి పడ్డ ఆ ఇద్దరు నేడు రాజకీయంగా తలపడడానికి సిద్ద పడుతున్నారు .వాటే చిరంజీవి ,బాలకృష్ణ .....ఈ మధ్య వీరిద్దరి మధ్య రాజకీయ వైరి వ్యాక్యలకు తెర లేచింది ...మాటకు మాట అనే వేడి ఇంకా రాలేదు కాని రావడానికి అవకాశం ఉంది .తాజాగా ఈ రోజు చిరం జీవి పై పోటీ చెయ్యడానికి సిద్దమని బాలయ్య ప్రకటించారు ...అంటే చిరు పై సై అంటున్నారు ....వీరిద్దరూ ఎలాను పోటీ చేయారు కాని ...మాటల యుద్ధం మాత్రం త్వరలోనే వినే అవకాశం ఉంది ..వేచి చూద్దాం ....పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

పంది పదియేను పిల్లలు పెడుతుంది .....



19, జనవరి 2012, గురువారం

నిప్పు సినిమా లో ఎన్ టి వి లో వచ్చిన కొత్త సాంగ్

నిప్పు సినిమా లో ఎన్ టి వి లో వచ్చిన  కొత్త సాంగ్ 
niippu song

.ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల!


సినీ నిర్మాతల ప్రచార తీరు మారు తోంది .."దండుకున్న వాడికి దండుకున్నంత " అన్నట్టు ఎంత ప్రచారం చేస్తుకుంటే అంత లాభం అని ఏ విషయాన్ని వదలడం లేదు ..టి వి ఆన్ చేస్తే చాలు బుసినెస్ మెన్ "పూరి " తెగ దంచుతున్నారు ...వర్మను మించిపోయారు .తాజాగా "నిప్పు " సినిమా పాటల సందడి కనిపిస్తోంది ...ఒక్కక్క న్యూస్ చానల్ లో ఒక్క పాట విడుదల చేస్తున్నారు ...(పాట ముక్కలేనండి ..మొత్తం కాదు లెండి ) నిన్న టి వి నైన్,నేడు ఎన్ టి వి లో పాట విడుదల చేసారు ..ఆడియో ఫంక్షన్ వేరుగానే ఉంటుంది అట ..ఇదో రక మైన ప్రచారం ....రవి తేజ ఆంజనేయులు సినిమాలో చెప్పినట్టు ...ప్రచారాలు జోరేత్తుతున్న్నై. న్యూస్ చాన్నాళ్ళ కు సరిపడా న్యూస్ లేదు ...ఆదాయం కావలి ..కాబట్టి సినిమా కబుర్లతో నింపుతున్నారు .

18, జనవరి 2012, బుధవారం

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి

మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి .....పాపం సి ఎం కిరణ్ గారు మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చెయ్యాలని ఆశించారు .....అయితే అయన ఇష్టం కాదు కదా ,,ఢిల్లీ పెద్దల మాటే వేదం ......సహా లక్ష రాజకీయాలతో కాంగ్రెస్స్ అధిస్తానవర్గం తల మునకైలై ఉంది ఒక వైపు అయిదు రాష్ట్రాల ఎన్నికలు ..తెలంగాన వేడి ఉండనే ఉంది ..ఈ నేపధ్యం లో ఎందుకు వచ్చిన గొడవ ...కదిపితే కందిరీగ అనుకున్నటున్నారు....." మన ప్రభుత్వాన్ని కాపాడిన  చిరు పార్టీ లో ఆ ఇద్దరినీ తీసుకుని ..సరిపెట్టికోమని ...చక్కగా చేతులు దులుపు కున్నారు ......

17, జనవరి 2012, మంగళవారం

.సి ఎం గారు! సమన్వయము మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి

ఏ  రాష్ట్రం బాగుపడాలన్నా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే నేతలపై ఆధారపడి ఉంటుంది .ముఖ్యమంత్రి తో పాటు మంత్రూలు సమిష్టిగా పనిచేస్త్నే జనం భాగుపడతారు .అయితే ప్రస్తుతం ఎడ్డ మంటే తెడ్డు అన్నట్టు ..మంత్రివర్గం లో సమన్వయము లేదన్న విషయం అందరికి తెల్సు .సి ఏం తన మార్కు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఆ పార్టీ లోనే వ్యతి రేక వర్గం అడ్డు పడుతోంది ...తమ మాట సి ఏం వినడం లేదని వారి ఆరోపణ .ఇదిలా ఉండగా ....ఈ రోజు ఢిల్లీ కాంగ్రెస్స్ లో సి ఏం ,కిరణ్ ,బొత్స  ఇతఃరుఅలు  జరిపిన రాజకీయం తో .....రాష్ట్ర మంత్రి వర్గం విస్తరిచానున్నారు .మరి సి ఎం కు నచ్చిన వారు వస్తారో ,హై కమాండ్ వారి సిపార్సు వారు వస్తారో వేసి చూడాలి ..ఈ నెల లో జరిగే మంత్రివర్గం విస్తరణ తర్వాత అయిన కిరణ్ సర్కార్ మరింత మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం .

శ్రీ రావులమ్మ అమ్మవారి జాతర ఉత్సవం వైభవం గా



మెట్టసీమ ఆరాధ్య దేవత శ్రీ రావులమ్మ అమ్మవారి జాతర ఉత్సవం వైభవం గా జరిగింది.ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్దిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ కార్య క్రమానికి పెద్ద ఎత్తున భక్త్తులు వచ్చారు  

డప్పు విన్యాసం చూసారా ? ఇదిగో వీడియో

డప్పు విన్యాసం చూసారా ? ఇదిగో వీడియో dappu vinyaasam

16, జనవరి 2012, సోమవారం

అన్నవరం పుణ్య క్షేత్రం లో అద్భుత నీడ గడియారం చూడండి వీడియో

అన్నవరం పుణ్య క్షేత్రం లో అద్భుత నీడ గడియారం ఉంది .ఇంచుమించు కొద్ది నిమిషాల తేడ ఉన్న సమయం యెంత అయ్యింది తెల్సుకోవడానికి బావుంటుంది .పంతొమ్మిది వందల నలబై మూడు సంవత్సరం లో దీనిని నిర్మించారు .తరవాత ఏబై ఎనిమిది లో దీని మళ్లి నిర్మించారు .కొండ పై సత్యనారాయణ స్వామీ సన్నిది .చెంత  గోసాల పక్కన ఇది కనిపిస్తుంది annavaram sundail

వీర్యం కోసం ప్రకటనలా ?.ఇరవై వేలు ?

వీర్యం కోసం ప్రకటనలా ? అసలు దేశం లో విలువలు ఎమౌతున్నై ?
పిల్లలు పుట్టలేదు ...కాబట్టి కృత్రిమ గర్భాదారంతో బిడ్డను కందమనుకున్నారు ..తప్పు లేదు .కాని పుట్టే వాడు తెలివైన వాడు కావలి అనుకుని ...ఐ ఐ టి విద్యార్ది వీర్యం కావాలని ఓ జంట చెన్నై లో ప్రకటన చేసారు ......దాత కు ఓ ఇరవై వేలు ఇస్తారట .....ఈ ప్రకటన  చూసి ఆ విద్యార్దులు అయోమయానికి గురి చ చ అనుకున్నారట ....
అందంగా ఉండే ఓ సినిమా హీరొయిన్ ..అమోఘ తెలివితేటలూ గల అందవికారం గా ఉండే ఓ కవి తో .."మనం పెళ్లి చేసుకుందాం .నీ తెలివి ..నా అందం గల బిడ్డ పుడుతుంది " అనగానే అయిన "రివర్స్ అయితే " అన్నాడట ...............................
 అందం తెలివి తేటలు అన్నవి భగవంతుని సృష్టి ....అందరకి అన్ని అన్ని ఉంటాయి ...మన యొక్క కృషి ,పట్టుదల ను బట్టి తెలివి అబ్బుతుంది ..అంతే తప్ప కేవలం కనేయ్యడం వాళ్ళ కాదు .....
వీర్యం లాంటి అమ్మకాలు జరుగుతూ ఉంటె ...ఇంకా ఎవరు నేరుగా పిల్లలను కానరు ...ఆయా అమ్మకాల కేంద్రాల నుంచి కొన్నుక్కోవడమే .

15, జనవరి 2012, ఆదివారం

.కోడి కొసల కోసం గొడవలు

కోడిపందాలు జరుగుతున్నాయి .అధికారులు మొదట ఎలా చెప్పిన పండుగ రోజుల్లో  ఎవరు లెక్క చెయ్యారు.సాంప్రదాయ పద్దతి లో పందాలు జరపుకుంటే పెద్దగా పట్టించు కో నవసరం లేదు ..అది ఓ సరదా గా సరిపెట్టుకోవచ్చు ..కాని రాను రానూ ఇది పెద్ద జూదం ల తయారయ్యింది ..అశాంతి వాతావరణాన్ని ఏర్పడుతోంది .అందుకే ఆంక్షలు .....ప్రజా ప్రతినిదుల ఒత్తిడి కి తల్లోగ్గి పండుగ మూడురోజులు పోలీసులు చూసి చూడనట్టు వదిలెయ్యడం తో గోదావరి జిల్లా లో "కాయ్ రాజా కాయ్ " జోరుగా జరుగుతోంది .తెలంగాణా రాయలసీమ వాసులు తో పాటు విదేశీయులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు .కాగా పల్లె సీమల్లో నూ అదే జోరు ...పందాలకు కొదవ లేదు ..నాటు కూడా ఫుల్ల్గా గా దొరుకుతూ ఉండడం తో అక్కడక్కడ కూడా కొట్లాటలు కూడా జరుగుతున్నట్లు సమాచారం ...కోడి కొసల కోసం ఎక్కువక్గా గొడవలు జరగడం సర్వసాదారణ విషయం ..కొస యమ టే స్టీ గా ఉందాం తో ధర కూడా వేళల్లోనే పలుకుతుంది .

.సినిమా .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే సంక్రాంతి కి రెండు "బి "లు

ప్రేక్షకులను పంచుకున్న "బి *లు ......సంక్రాంతి అనే సరికి తెలుగు లో కనీసం అయిదారు సినిమాలు సందడి చేస్తాయి .అయితే నేడు ముఖ్య  హీరోల చిత్రాలు రెండే విడుదల అయ్యాయి ....అవి బిసినెస్ మెన్ మరియు బాడిగార్డ్...నిజానికి రెండు కూడా ఏవరేజ చిత్రాలే ......మరేవీ పోటి లేక పోవడం తో  కుర్రకారు ...మొదటి చితాన్ని ..మిగతా వారు రెండవ చిత్రాన్ని చూడక తప్పడం లేదు .....జాగర్త గా పరిశీలిస్తే ఓ విషయం అర్ధమవుతోంది ..
 నేడు ఏ సినిమా ku అయిన మొదటి మూడు రోజుల కలక్షనలే కీలకం ...
ఈ నేపధ్యం లో పండుగకు విడులవుతాయి అనుకున్న చాల చిత్రాలు వాయిదే వేసినట్టు అనుకోవచ్చు .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే  ఎవరు ఎవరికి పోటి రాకుండా జాగర్త పడుతున్నర్రు అన్న మాట .

చలి సంక్రాంతి .

చలి సంక్రాంతి ..నిజం గా ఇది చలి సంక్రాంతే.ఎన్నడు ఇంత చలి లేదు .భోగి మంట సంప్రదాయం ఎందుకు పెట్టారో ఇప్పుడు అందరికి అర్ధం అవుతోంది ..చలి కి ఎవ్వరు నిద్ర లేవడానికి ఇష్టపడరు ..అయితే పండుగ రోజున పెందల కాదనే నిద్ర లేవక తప్పదు.లేచిన తర్వాత చక్కగా భోగి మంట దగ్గర కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటోంది ..సంక్రాంతి రోజున అదే పరిస్తితి ...ఈ సంవత్సరం ముందుగ చలి లేకున్నా తర్వాత భాగ పెరిగింది ...అన్ని వసతులు గల వారికి పర్వ లేదు కాని దుప్పటి కూడా లేని పేద వాళ్లకు నరకమే ..ముఖ్యం గా వసతి గ్రుహాల్ల్లో ఉండే విద్యార్దులు చాల బాధ పడతారు .వీరి గురించి ఆలోచించాలి ప్రభుత్వం .. 

13, జనవరి 2012, శుక్రవారం

కథకు హీరో ఉంటేనా చాలా?....... బిసినెస్ మెన్ సినిమా చూస్తె అందరికి అర్ధం అవుతుంది .

కథకు హీరో ఉంటేనా చాలా?....... బిసినెస్ మెన్ సినిమా చూస్తె అందరికి అర్ధం అవుతుంది .అసలు విషయం ..నిజం గా ఈ సినిమా మహేష్ బాబు చేసాడు కాబట్టి సరిపోయింది గాని ...లేక పోతే ఊహించడం కష్టం ...నవ రసాలు ఉంటేనే ఏ సినిమా అయిన ప్రేక్షకుడు చూసేది ..దూకుడు ఆ రేంజ్ లోనే ఆడింది ....ముఖ్యం గా కామిడి సీన్స్ ఆ సినిమాలో ఎంతో బావున్నై .అన్ని రకాల సేడ్స్ ఉన్నాయ్ 
  కాని పూరి వారి తాజా సినిమా బిసినెస్ మెన్ లో కేవలం హీరో తో నే అన్ని చేయన్చారు .హాస్య నటులు అసలు లేరు ..ఆ లోపం పూర్తిగా కనిపించింది .మానవత్వం అన్న మాట పదే పదే పలికారు కాని ఎక్కడ అది కనిపించ లేదు ..మాపియా కథల కాపిల సిమేమా తీస్తే ఎలా ? సెక్స్ సీన్స్ కనపడకుండా తెరలు పెట్టిన ..బూతు డైలాగ్స్ కట్ అయిన ....బూతు మాటలు ఫుల్ గానే ఉండడం బాగా లేదు ....సరి అయిన కథ లేక పోతే ...ఆ సినిమా అంటే మరి ....

బిసినెస్ మెన్ ఎలా ఉంది

మహేష్ బాబు తాజా సినిమా బిసినెస్ మెన్  భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదల అయ్యింది .....దూకుడు తరవాత వచ్చిన ఈ సినిమా గురించి భారిగా ప్రచారం జరింగింది .
 సినిమాలో ఏమి నచ్చాయి ? 
మహేష్ నటన ....డైలాగ్స్ తూటాల కంటే  వేగం గా పేలాయి 
సాంగ్స్   బావున్నై ..ఊపు నిస్తాయి .....ఫైట్స్ మామూలే ..కాజల్ నటన బావుంది .


లేనిది 
 కథలో బలం లేదు .....అంత మహేష్ డైలాగ్స్ ...సస్పెన్సే లేమి..భారీ సెట్స్ ఏమి లేవు..పోకిరి తో పోల్చకూడదు   
 కథ 
 అమెరికా లో మంచి బిజినెస్ చేసి డబ్బు సంపాందించి ఇండియా కు సేవ చేద్దామని వచ్చిన ఓ ప్రవాస భారతీయుడు కొడుకు సూర్య ....రాజాకీయ నేత ను నమ్మి ..అతని మోసం తో సూర్య తల్లిదండులు ప్రాణాలు కోల్పోతారు ....ఆ నేత పై పగ తో రగిలే కుర్రోడు  సూర్య తన తెలివితేటలతో ముంబై కి దడ పుట్టిస్తాడు ....పోలీసు ఆఫీసర్ కూతురు చిత్ర (కాజల్ ) తో ప్రేమ నడుపుతాడు .......ఇంతకి సూర్య  ఆ నేతను ఏం చేసాడు ?....ఎలా అయ్యాడు అన్నదే కథ  ఎలా ఉంది 

12, జనవరి 2012, గురువారం

ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..

పి సి సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కు తనకు ఎటువంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు జనం చెప్పుకుంటున్నారు .అదంతా మీడియా సృష్టి అని సి ఏం గారే చెబుతున్నారు ..పోనీ అలా అనుకుంటే  ఒకటో ,రెండో పత్రికల్లో ..లేదా చానల్ లో రావాలి కాని ..మీడీయా మొత్తం మీద ఈ వార్తలు వచ్చాయి ...ఇద్దరి మాట ఎలా ఉన్న ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..బొత్స సత్యనారయణ సి ఏం కావడానికి ప్రయతిస్తున్నారని ....అందుకే గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్స్ ఉందని ...మరో పక్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ ,మెగా స్టార్ చిరు కూడా సి ఏం రేసులోనే ఉన్నారు ...కాంగ్రెస్స్ లో ఏదన్నా సాధ్యమే ..కాకపోతే ఏచిచూడాలి..

11, జనవరి 2012, బుధవారం

క్యాంపస్ ఇంటర్వ్యూ ల కు హాజారవుతున్నారా ? జాగర్త .

క్యాంపస్ ఇంటర్వ్యూ ల కు హాజారవుతున్నారా ? జాగర్త .  మీ దగ్గర డబ్బులు దండుకుని మిమ్మల్ని మోసం చేసే టోపీ గాళ్ళు  వస్తున్నారు .వీరిలో ఆడ కేడీలు కూడా ఉన్నారు .తూర్పులో ఇలాంటివారినే పోలీసులు పట్టుకున్నారు .పూర్తిగా చదువు లేకపోయినా ఆంగ్ల పరిజ్ఞానం సంపాదించిన భార్య భర్తలు  ఉన్నత చదువులు గాల వారికే టోపీ పెట్టేసారు .జిల్లాలో గల ఇంజనీరింగ్ వంటి ఉన్న్నత విద్య సంస్థలకు వచ్చి కాంపస్ ఇంటర్వ్యూలు పేరుతో కొత్త మొత్తాన్ని కట్టించుకోవడం ,నకిలీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వీళ్ళ పని ..డబ్బులు సమర్పించుకున్న వారిలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయట ......అది సంగతి .....
       ఆయా విద్య సంస్థ ల వారు తమ సంస్థలలో చదివిన వారి కోసం ...వచ్చిన ప్రతి వారిని ఇంటర్వ్యూలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల్లె ఇలాంటివి జరుగుతున్నాయని  విద్యార్ధులు వాపోతున్నారు .ఇప్పనికైన కళ్ళు తెరచి ....మంచి పేరు గల సంస్థలను ....మోసం లేని వారినికి మాత్రమె అనుమతించి విద్యార్దులు జీవితాలు కాపాడవలసి ఉంది 

10, జనవరి 2012, మంగళవారం

తూరుపు లో ఆ నల్గురు ఏం ఎల్ ఏ లకు ఆశాభంగమే

ఆ నల్గురు ఎంతో ఆరాట పడ్డారు .కనీసం ఒకరికైనా మంత్రి యోగం దక్కుతుందని ..అయితే వారి ఆసలు ఆవిరి అయ్యాయి ...వారే ప్రజారాజ్యం ఏం ఎల్ ఏ లు  వంగా గీత ,బండారు సత్యానందం ,పంతం గండి మోహన్  మరియు కురసాల కన్నబాబు .చిరంజీవి కాంగ్రెస్స్ గూటిలో చేరిన నేపథ్యం లో తూర్పు లో ఎక్కవ గా ఉన్న నల్గురి లో ఒకర్కి మంత్రి పదవి ఖాయం అని ..పైగా ప్రస్తుత మంత్రి తోట నరసింహం పదవికి గండం అని వార్తలు వచ్చాయి .అయితే నేడు జరుగుతున్నా పరిణామాల ప్రకారం చిరు వర్గం నుంచి రామచంద్రయ్య ,గంటా శ్రినివాసులకే  మంత్రి పదవులు దక్కుతున్నాయని ..ఈ  నెల పంతోమిదోవ తేదిన ప్రమాణ స్వీకారం చేయ్యబోతునట్లు రూడీ అవుతోంది ..అంటే ఆ నల్గురి ఇక ఆశాభంగమే .

సంక్రాంతి మజా తూర్పు లోనే

తూర్పు నుంచి రాజధానికి మరో నాలుగు  రైల్స్ ప్రకటించడం ఆనందదాయకం .సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరబాద్ లో ఉన్న వేలాది మంది విధిగా స్వస్థలానికి వస్తారు .ముఖ్యంగా ఉబయగోదావరి జిల్లాలకు తాకిడి ఎక్కువ ..రాష్ట్రం లో ఎక్కడ లేని సరదా ఇక్కడే ఉంటుంది మరి .ఇంటి దగ్గర మహిళలు ,ఆరు బయట పురుషులు చేసే సందడి .....అల్లరి చూసి తీరవలసిందే పండుగ మజా చెయ్యాలి అంటే ఇక్కడ కు రావాల్సింది .చక్కని ప్రకృతి మధ్య ఏ  సాంప్రదాయ "పందాలు " చూడాలన్న ఇక్కడే సాధ్యం .ఎన్ని అడ్డంకులున్న కనీసం పండుగా మూడు రోజు లు ఎంజాయ్ చెయ్యవచ్చు ...(ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ..అనుమతులు పొందేసారు !).ఇక వెళ్ళడానికి ,రావడానికి రైల్స్, ఏ సి బస్సులు ఉండానే ఉన్నాయ్ 

6, జనవరి 2012, శుక్రవారం

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు

తోట గోపాల కృష్ణ మూర్తి అంత్యక్రియలు ముగిస్సాయి .ఉదయం నుంచి అనేక మంది ప్రముఖులు ఆయన బౌతిక కాయని దర్శించి నివాళులు అర్పించారు .వై ఎస్ జగన్ ,జిల్లా మంత్రులు ,మూడు పార్టీల నేతలు ..వచ్చారు .మంత్రి తోట నరసింహం కాడి కూడా పట్టారు 

5, జనవరి 2012, గురువారం

తోట గోపాల కృష్ణ మృతి

తోట గోపాల కృష్ణ మృతి చెందారు .కాకినాడ ఎం.పి గా ,పెద్దాపురం ఎం ఎల్ ఏ గా ఆయన పనిచేసారు .తెలుగుదేశం లో ఎం పి ,కాంగ్రెస్స్ లో ఎం ఎల్ ఏ ..నేడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ లో ఉన్నారు ..ఆయన సభలో ఏమి మాట్లాడిన సరదాగా ఉంటుంది .ఏ విషయాన్నీ అయిన పిట్ట కతల లతో ముడి వేసి చెప్పి జనం తో చప్పట్లు కొట్టించు కోవడంలో ఆయనకు ఆయనే సాటి .గోపాల కృష్ణ మృతి పట్ల అన్ని పార్టీల నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు 

4, జనవరి 2012, బుధవారం

కంటి శిబిరం



జగ్గంపేట లయి న్ కంటి ఆసుపత్రి వారి అధ్వర్యంలో కంటి శిబిరం జరిగింది 

3, జనవరి 2012, మంగళవారం

గ్రామసభ




జగ్గంపేట ,గోవిందపుర గ్రామాల్లో ఏం పి డి ఓ నాతి బుజ్జి గ్రామసభ నిర్వహించారు .మధ్యాహాన బోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు 

1, జనవరి 2012, ఆదివారం

పోటా పోటీగా వేడుక చేసి .....

జగ్గంపేట లో నూతన సంవత్సర వేడుకలు చాల భారీగా జరిగాయి .రాజకీయ నేతలు పోటా పోటీగా వేడుక చేసి అభిమానులను అలరించారు .వీరవరం లో మంత్రి తోట నరసింహం ,ఇర్రిపాక లో జ్యోతుల నెహ్రు ,జగ్గంపేట లో జ్యోతుల చంటిబాబు సందడి చేసారు .నెహ్రు ,చంటి బాబు శిబిరాల్లో బోజనాల హడావడి భారీ స్తాయిలో కనిపించింది .మొత్తం మీద ముగ్గురు దగ్గరాకు జనం భారీగానే వచ్చారు