mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

15, నవంబర్ 2011, మంగళవారం

అసలైన ఆదర్స రైతులు ఎవ్వరో తేలిపోనుంది!

అసలైన ఆదర్స రైతులు ఎవ్వరో ఈరోజు తేలిపోనుంది .రైతులకు అవగాహన కల్పించడానికి వై ఎస్ సర్కార్ వీరిని ఏర్పాటు చేసారు .వీరికి నెలకు గౌరవ వేతనం కూడా చెల్లిస్తున్నారు .అయితే నూటికి పది శాతం కూడా సరిగ్గా పనిచేయ్యండం లేదు అని అధికారులే అంచనా వేస్తున్నారు .గతం లో కొంత మందిని తొలగించారు .నేడు మళ్లి కొందరు బయటకు వెళ్ళబోతున్నారు . ఎందుకంటె వీరికి పరీక్ష నిర్వహించి పాస్స్ అయిన వారినే కొన సాగిస్తారు .ఈ వార్త తెలియగానే వీరి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నై .ఏ ప్రశ్నలు అడుగుతారో నని హడలి పోతున్నారు .ఇప్పటివరకు నెల నెల డబ్బులు తీసుకోవడం తప్ప సాటి రైతుకు సాహాయ పడధామన్న కనీస ఆలోచన చెయ్యని చాల మంది ..ఉద్యోగం ఊడితే డబ్బులు పోతాయన్న ధ్యాస లోనే కనిపిస్తూ ఏదోలా మేనేజ్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్న్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి